Saturday, April 27, 2024

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 11 మంది మృతి..

బేతుల్ : బ‌స్సు, కారు ఢీకొన్న ఘ‌ట‌న‌లో 11 మంది దుర్మ‌ర‌ణం చెందిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లాలోని ఝల్లార్‌ వద్ద బస్సు, కారు ఎదురెదురుగా వ‌చ్చి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో 11 మంది అక్క‌డిక్క‌డే మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. మ‌రికొంద‌రికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంలో కారు బాడీ మొత్తం నుజ్జునుజ్జుగా మారింది. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సిమలా ప్రసాద్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement