Friday, March 29, 2024

వరదాయిని ఉత్థాన ఏకాదశి

కార్తిక శుద్ధ ఏకాదశికే ఉత్థాన ఏకాదశి, బోధ న ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి అని పేర్లు. ఆషాడ శుద్ధ ఏకాదశి, అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశిగా అయ్యింది. దీనినే హరి బోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకా దశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంప శయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి అంతా జాగరణ చేసి, మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణు పూజ చేసి, పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి. ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మ#హర్షికి మధ్య జరిగిన సం భాషణ స్కంద పురాణంలో కనిపిస్తుంది. ఉత్థాన ఏకాదశి పాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండ ంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలా ఒక జీవు డు, తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చి వేస్తుంది ఈనాటి ఏకాదశి ఉప వాస వ్రతం. ఈ రోజు చిన్న మంచిపని (పుణ్య కా ర్యం) చేసినా, అది మేరు పర్వతానికి సమానమైన పు ణ్య ఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉం డవు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంప దలు, ఉన్నత స్థానం కలగడంతో పాటు పాపాపరి హారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పు ణ్యం ఒక్కసారైనా, ఈ ఏకాదశి ఉప వాస వ్రతం చేసినవారికి లభిస్తుంది” అని బ్రహ్మ దేవుడు నారదునికి వివరించినట్లు పురాణ కథనం.
ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్య గ్రహణ సమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లభి స్తుంది. వస్త్రదానం చేయడం వలన, పండ్లు, దక్షిణ తో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలో కంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి.
ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నె రులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగు లు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ, భజన లతోనూ, హారతులతోనూ శ్రీమహావిష్ణువును నిద్రలే పుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అప మృత్యు దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి. విష్ణుమూర్తికి హరతి ఇవ్వడం సాంప్ర దాయం. ఏవైనా కారణాల వల్ల ఇంటిలో హారతి ఇవ్వడం కూడా కుదరక పోతే దేవాలయానికి వెళ్ళి. అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా తిలకించి, వీలైతే స్వామికి హారతి కర్పూరం సమర్పించాలి. ఇలాచేస్తే అపమృత్యు దోష పరిహారం జరుగు తుంది. స్వామి అనుగ్ర#హం కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement