Tuesday, April 30, 2024

National : బీహార్‌లో ఘోర ప్రమాదం…తొమ్మిది మంది మృతి

బీహార్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. కైమూర్ జిల్లాలో మూడు వాహ‌నాలు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో తొమ్మిది మంది మృతి చెందారు.

బీహార్‌లోని కైమూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు దేవ్కాళి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు అదుపుతప్పి మరో మార్గంలోకి వెళ్లాయి. అయితే ఎదురుగా వస్తున్న ట్రక్కు వాటిని గుద్దింది. జీపులో ఉన్న ఎనిమిది మందితోపాటు బైక్పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందారు. దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement