Friday, May 24, 2024

అభిమానులు.. ఫాలోవర్స్ తో కలిసి సినిమా చూడనున్న విశ్వక్ సేన్

అశ్వత్‌ మారిముత్తు ద‌ర్శక‌త్వం వహించిన చిత్రం ఓరి దేవుడా. అక్టోబర్‌ 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది.టాలీవుడ్ యువ హీరో విశ్వక్‌ సేన్ , మిథిలా పాల్కర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కింది. కాగా కొత్త అప్‌డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. హీరో విశ్వక్‌ సేన్‌ తన అభిమానులు, ఫాలోవర్లతో కలిసి సినిమా చూడబోతున్నారు. హైదరాబాద్ ఆర్‌టీసీ ఎక్స్‌ రోడ్స్‌ లోని దేవి 70ఎంఎం థియేటర్‌లో అభిమానులతో కలిసి నేడు సెకండ్‌ షో చూసేందుకు వస్తున్నట్టు ఇన్‌ స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చాడు విశ్వక్‌ సేన్. హీరోయిన్లు మిథిలా పాల్కర్‌, ఆశా భట్‌ కూడా ఈ టీంలో జాయిన్ కాబోతున్నట్టు టాక్‌. ఓరి దేవుడా త‌మిళంలో తెర‌కెక్కిన ఓ మై క‌డ‌వులేకు తెలుగు రీమేక్‌గా వచ్చింది. త‌మిళ వెర్షన్‌ తెర‌కెక్కించిన అశ్వత్‌ మారిముత్తు తెలుగులో కూడా డైరెక్ట్ చేశాడు. విక్టరీ వెంక‌టేశ్ కీలక పాత్రలో నటించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement