Monday, May 6, 2024

Breaking: ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో కుటుంబం ఆత్మహత్య

హైదరాబాద్ లోని ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య, భర్త, కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన వారు. ఈ ఘటన వారసి గూడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

కర్నూలు జిల్లా లక్ష్మీపురంకు చెందిన కొప్పుల సాయికృష్ణ, భార్య చిత్రలేఖ, నాలుగేళ్ల కూతురు తేజస్వినితో కలిసి సిటీలోని ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో నివాసముంటున్నారు. చిత్రలేఖ హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ సెంటర్ ఉద్యోగం చేస్తుండగా.. అక్కడే పనిచేస్తున్న శ్యామ్ కొఠారి, గీతారావులు ఆమెను వేధింపులకు గురి చేశారు.. చిత్రలేఖపై తప్పుడు ఆరోపణలు చేసి ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన చిత్రలేఖ డిప్రెషన్ లోకి వెళ్లింది. అయితే ఉద్యోగంలో వేధింపుల కారణంగా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాయడంతో ఇది సంచలనంగా మారింది. నాలుగేళ్ల కుమార్తె తేజస్వినికి ఉరివేసిన తర్వాత.. భర్త సాయికృష్ణ, భార్య చిత్రలేఖ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సూసైడ్ లేఖ ఆధారంగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement