Wednesday, May 8, 2024

Encounter – గ్యారంటీల‌కు గాంధీలు…క్ష‌మాప‌ణ‌ల‌కు బంట్రోతులా …చిదంబరంపై క‌విత మండిపాటు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ , బీఆర్ఎస్ ల మ‌ధ్య డైలాగ్ వార్ పీక్ కు చేరింది.. సోషల్ మీడియా వేదికగా ఈ పార్టీల మాటల దాడితో హీట్ ను పెంచేస్తున్నాయి.. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చిదంబరం గురువారం మాట్లాడిన అంశంపై ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స‌మాధానం ఇచ్చారు… ‘గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా? ఆరు దశాబ్ధాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా? పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తుకు రాకపోవడం బాధాకరం! ఈ గడ్డమీద జోడో యాత్రలు చేసి ఒక్క సారి కూడా జై తెలంగాణ చెప్పకపోవడం దారుణం. ఈ రోజుకీ మీకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం. సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మొకరిల్లినా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు!’ అంటూ కవిత ట్విట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement