Wednesday, May 15, 2024

హైదరాబాద్‌లో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తపై మరో కేసు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌పై మరో కేసు నమోదైంది. నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో భార్గవ్‌రామ్‌తోపాటు ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డిపై నకిలీ కరోనా సర్టిఫికెట్‌ కేసు నమోదయింది. కోర్టు విచారణకు హాజరుకాకుండా నకిలీ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కిడ్నాప్‌ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్‌, జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి ఈ నెల 3న కోర్టులో హాజరుకావాల్సి ఉంది.

అయితే కోర్టుకు హాజరుకాకుండా ఉండటానికి ఈనెల 1న భార్గవ్ రామ్ నకిలీ సర్టిఫికెట్‌ సమర్పించినట్లు అభియోగాలు వచ్చాయి. కరోనా కారణంగా కోర్టుకు హాజరు కాలేమని సదరు సర్టిఫికెట్‌లో భార్గవ్ రామ్ పేర్కొన్నారు. అయితే కోవిడ్‌ సర్టిఫికెట్లను బోయిన్‌పల్లి పోలీసులు పరిశీలించారు. ఇందులో భాగంగా ఆ సర్టిఫికెట్‌ ఇచ్చిన దవాఖానలో విచారించారు. ఈ సందర్భంగా నకిలీ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు ధ్రవీకరించారు. నకిలీ సర్టిఫికెట్‌ ఇచ్చిన ఓ ఆస్పత్రి సిబ్బంది వినయ్‌, రత్నాకర్‌, శ్రీదేవిపై కేసు నమోదుచేశారు.

ఈ వార్త కూడా చదవండి: పొలిటికల్ ఎంట్రీపై కేసీఆర్ మనవడు సంచలన ప్రకటన

Advertisement

తాజా వార్తలు

Advertisement