Tuesday, April 23, 2024

పొలిటికల్ ఎంట్రీపై సీఎం కేసీఆర్ మనవడు సంచలన ప్రకటన

సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ రంగ ప్రవేశంపై హిమాన్షు ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు వారసుడిగా హిమాన్షు రాజకీయాల్లోకి రావడం ఖాయమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ తరహాలో హిమాన్షు కూడా రాజకీయాల్లో రాబోతున్నారంటూ చర్చ జరుగుతోంది. అయితే హిమాన్షు మాత్రం తన రాజకీయ భవిష్యత్‌పై ఇప్పుడే క్లారీటి ఇచ్చాశాడు. తాను భవిష్యత్‌లో ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశాడు. తనకంటూ ప్రత్యేక లక్ష్యాలు ఉన్నాయని, వాటిని చేరుకోవడమే తన ధ్యేయమని తెలిపాడు. ఈ మేరకు హిమాన్షు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని కుటుంబ పార్టీ అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో హిమాన్షు తాజా ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా చదవండి: నిర‌స‌నకారుల‌పై చర్యలకు కేటీఆర్ ఆదేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement