Wednesday, May 15, 2024

కోర్టులో పేలుడు క‌ల‌క‌లం..

దేశ రాజధాని అయిన‌ ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఇవాళ‌ మళ్లీ పేలుడు కలకలం సృష్టించింది. ఉదయం రోహిణి గేట్‌ నంబర్‌ 102లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ పేలుడులో ఒకరు గాయపడ్డారు. ఒక్కసారిగా వచ్చిన భారీ శబ్దంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గుర‌య్యారు. ఒక్క‌సారిగా సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ప‌రుగులు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ల్యాప్‌టాప్‌లో పేలుడు సంభవించినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. ముందుస్తు జాగ్రత్తగా రోహిణి కోర్టులో తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశారు. పేలుడు ఘ‌ట‌న‌తో ఘ‌ట‌నా స్థ‌లికి ఏడు అగ్నిమాపక యంత్రాలు కూడా చేరుకున్నాయి. అయితే భారీ ప్ర‌మాద‌మేమీ కాద‌ని.. అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement