Thursday, May 9, 2024

ప‌ట్నా సివిల్ కోర్టులో పేలుడు..

సివిల్ కోర్టులో పేలుడు సంభ‌వించిన ఘ‌ట‌న బీహార్ లో చోటుచేసుకుంది. బీహార్ రాజ‌ధాని ప‌ట్నా సివిల్ కోర్టులో శుక్ర‌వారం మ‌ధ్యామ్నం పేలుడు ఘ‌ట‌న‌లో కానిస్టేబుల్ కు గాయాల‌య్యాయి. వెంట‌నే చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పేలుడు స‌మాచారం అంద‌గానే పోలీసు అధికారులు ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకుని ప‌రిస్ధితిని అదుపులోకి తీసుకువ‌చ్చారు.

తేలిక‌పాటి పేలుడు కావ‌డంతో పెద్ద‌గా ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. పేలుడుకు కార‌ణాలేంట‌నే వివరాలు ఇంకా వెల్ల‌డి కాలేదు. ప్రాధ‌మిక ద‌ర్యాప్తు అనంత‌రం ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయ‌ని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement