Thursday, May 23, 2024

Hyd: రెచ్చిపోతున్న కాల్ మనీ గ్యాంగ్.. మైనర్లే టార్గెట్ గా దందా

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో కాల్ మనీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. అధిక వడ్డీల పేరుతో సామాన్యులను వేధిస్తున్నారు. కాల్ మనీ గ్యాంగ్ లో ఓ ప్రభుత్వ అధికారి కొడుకు కార్తీక్ చిక్కుకుపోయాడు. రూ.50వేల అప్పు ఇచ్చి మూడు నెలల్లో రూ.లక్ష వసూలు చేస్తున్నారు. మైనర్లే టార్గెట్ కాల్ మనీ గ్యాంగ్ దందా కొనసాగిస్తోంది. చక్రవడ్డీతో సహా కడతావా? చస్తావా ? అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఓ విద్యార్థి నుంచి రూ.4లక్షలు వసూలు చేసి.. మరో లక్ష కు గ్యాంగ్ డిమాండ్ చేసింది. దీంతో ఆ విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement