Thursday, May 2, 2024

ఆస‌క్తిని రేకెత్తిస్తోన్న – విరాట‌ప‌ర్వం ట్రైల‌ర్

ఆస‌క్తిని రేకెత్తిస్తోంది విరాట‌ప‌ర్వం చిత్రం ట్రైల‌ర్. ఈ చిత్రంలో సాయిపల్లవి – రానా ప్రధానమైన పాత్రలను పోషించారు.ఈ సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్ల‌లో రిలీజ్ కానుంది. ది బర్త్ ఆఫ్ వెన్నెల అనే టైటిల్ తో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అడవిలో .. అర్ధరాత్రివేళలో .. వర్షం కురుస్తూ ఉండగా ఓ స్త్రీకి పురిటి నొప్పులు మొదలవుతాయి.ట్రాక్టర్ పై ఆమెను హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ, నక్సలైట్స్ కీ .. పోలీసులకి మధ్య జరుగుతున్న కాల్పుల్లో చిక్కుకుంటారు. అప్పుడు ఒక లేడీ నక్సలైట్ ఆమెకి పురుడు పోసి .. ఆ పాపకి ‘వెన్నెల’ అనే పేరు పెడుతుంది. ఆ మరుక్షణమే ఆ లేడీ నక్సలైట్ పోలీస్ తూటాలకు బలవుతుంది. అలా పోరాటంలో పుట్టిన ఆ వెన్నెలనే ఈ సినిమా కథానాయిక సాయిపల్లవి. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా .. ఎమోషనల్ గా ఉంది. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంది. అటవీ ప్రాంతంలో చీకట్లో మగ్గుతున్న జీవితాలకు వెలుగునిచ్చే పాత్రను సాయిపల్లవి పోషించింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement