Wednesday, May 15, 2024

టాస్ మళ్లీ ఇంగ్లండ్‌దే.. సూర్యకుమార్‌కు దక్కని చోటు

పూణె వేదికగా కాసేపట్లో భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో మళ్లీ టాస్ ఇంగ్లండ్ జట్టునే వరించింది. టాస్ గెలిచిన ఇంగ్లీష్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇయాన్ మోర్గాన్ గాయపడటంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుకు జోస్ బట్లర్ నాయకత్వం వహించనున్నాడు. అందరూ కోరుకున్నట్లు సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం భారత తుదిజట్టులో స్థానం లభించలేదు. గాయపడ్డ శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్‌కు చోటిచ్చారు.

భారత్: రోహిత్, ధావన్, కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్డిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, కుల్ దీప్ యాదవ్, ప్రసీధ్ కృష్ణ

ఇంగ్లండ్: జాసన్ రాయ్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, డేవిడ్ మలాన్, జాస్ బట్లర్, లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, శామ్ కరణ్, టామ్ కరణ్, రషీద్, టాప్లీ

Advertisement

తాజా వార్తలు

Advertisement