Saturday, May 11, 2024

ఇద్ద‌రు పిల్లలు గొంతుకోసి త‌ల్లి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

చిత్తూరు జిల్లా వి.కోట మండలం కొంగాటం పంచాయితీ అట్రపల్లె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె, కుమారుడి గొంతు కోసిన ఓ తల్లి తానూ అత్మహత్యాయత్నం చేసింది. వివ‌రాల‌లోకి వెళితే కొంగాటం పంచాయతీ అట్రపల్లెకు చెందిన భార్యాభర్తలు ఆనంద్, మీనాక్షి మధ్య ఇటీవల కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మీనాక్షి కుమార్తె మధులిక(5), కొడుకు మనోజ్(7)లను కత్తితో గొంతు కోసి తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానికులు గ‌మ‌నించి వెంట‌నే అడ్డుకున్నారు.. గాయ‌ప‌డిని వారిని చికిత్స కోసం కుప్పం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement