Monday, May 6, 2024

పరిసరాల పరిశుభ్రత..

కాసిపేట : మండలంలోని సోమగూడెం (కె) గ్రామ పంచాయతీ కేంద్రంలో డీఎల్‌పీఓ ఫణీందర్‌ పర్యటించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనులు డంపింగ్‌ యార్డ్‌, వైకుంటదామం, పల్లె ప్రకృతివనం, నర్సరీలతో పాటు వాడలు తిరుగుతూ పారిశుధ్ద్య పనులను సైతం పరిశాలించారు. స్థానికులతో మాట్లాడుతూ, తడి పొడి చెత్త వేరు చేయాలని, పరిసరాలు పరిశుభ్రుంగా వుండేలా చూడాలని, గ్రామ అభివృద్దికి సహకరించాలని సూచించారు. అనంతరం పంచాతీ కార్యాలయంలోని రికార్డ్‌లను పరిశీలించారు. డీఎల్‌పీఓ వెంట సర్పంచ్‌ శంకర్‌, ఎంపీఓ సప్ధర్‌ అలీ, కార్యర్శి, వార్డ్‌ సభ్యులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement