Tuesday, April 30, 2024

Parlament: ఎన్నిక‌ల రిజ‌ల్ట్స్ మ‌ర్నాటి నుంచే పార్లమెంట్ శీతాకాల స‌మావేశాలు…

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ అనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒక రోజు తర్వాత శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 4 నుంచి 22 వరకు ఈ స‌మావేశాలు కొనసాగనున్నాయి.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2న అఖిలపక్ష అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 2న అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు. కాగా డిసెంబర్ 3 న జరగాల్సిన ఈ అఖిలపక్ష సమావేశం ఆ రోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల పలితాలు ఉండటంతో ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement