Monday, May 6, 2024

NLG: ఓటమి భయంతోనే రైతుబంధు నిలుపుదల..కాంగ్రెస్ రైతుల వ్యతిరేకి..

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : రైతుబంధును ఆపిన కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా ఎన్నికల ఇంచార్జ్ బూడిద బిక్షమయ్య గౌడ్, భారాస రాష్ట్ర నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి అన్నారు. ఇవాళ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ముందస్తు పెట్టుబడి అందించేందుకు రైతుబంధు పథకం ప్రారంభించారన్నారు. ఇప్పటికే 11సార్లు రైతుబంధు ఇచ్చారని, కేంద్ర ఎన్నికల సంఘం సైతం రైతుబంధు నిరంతర ప్రక్రియ కాబట్టి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు వేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఓటమి భయంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో బీజేపీ ఢిల్లీలో కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘం నుండి తిరిగి రైతుబంధును వేయకుండా ఆదేశాలు ఇప్పించారన్నారు.


అటువంటి కాంగ్రెస్, బీజేపీలకు ఈనెల 30న జరిగే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పేద ప్రజల అభివృద్దే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నాడని చెప్పారు. ప్రతి మహిళకు మూడు వేల రూపాయలు, 400 రూపాయలకే సిలిండర్ అందిస్తామని, తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికీ సన్న బియ్యంతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా అందిస్తామన్నారు. సన్యాసులకు ఓటు వేస్తే అభివృద్ధి జరగదని, నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డిలకు మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement