Monday, May 27, 2024

Breaking: TRS ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్..

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాకిచ్చింది. నామా నాగేశ్వరరావుకు చెందిన రూ.96కోట్ల ఆస్తులు జప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి గతేడాది జూన్ లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలు వున్నాయి. రూ.1064 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు వున్నాయి. ఈ క్రమంలోనే నామా నివాసంతో పాటు కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement