Monday, April 29, 2024

బ్రేకింగ్….తెలంగాణలో ఎంసెట్ పరీక్షల తేదీలు ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ను కూడా ఎత్తివేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. కాగా జూలై ఫస్ట్ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలని కూడా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఎంసెట్ తేదీలను ఖరారు చేసింది.

ఆగస్టు 5 నుంచి 9వరకు పరీక్షలు నిర్వహించనున్నామని ప్రకటించింది. ఆగస్టు 3న ఈసెట్ జరగనుంది. ఇక ఆగస్టు 11-14 మధ్య పీఈసెట్ జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 1 నుంచి డిగ్రీ, పీజీ, వృత్తి విద్య
కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement