Saturday, April 27, 2024

పోలీస్‌ కస్టడీకి డ్రగ్స్‌ కేసు నిందితుడు మోహిత్‌..

డ్రగ్స్‌ కేసులులోని నిందితుడు మోహిత్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి గురువారం ఉదయం రాంగోపాల్‌ పేట పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్‌ వాడుతున్న ప్రముఖుల గురించి మోహిత్‌ను ప్రశ్నించనున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్స్‌ తెచ్చారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోవా కింగ్‌ పిన్‌ ఎడ్విన్‌తో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మోహిత్‌ కాల్‌ లిస్ట్‌, వాట్సాప్‌ చాటింగ్‌లపైనా పోలీసులు ప్రశ్నించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement