Wednesday, May 15, 2024

Followup: సరిహద్దులో డ్రోన్‌ కలకలం.. కూల్చివేసిన భద్రతా బలగాలు..

కశ్మీర్‌ సరిహద్దులో మరోమారు డ్రోన్‌ కలకలం సృష్టించింది. కథువా జిల్లా సమీపంలో అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ ఆదివారం ఉదయం భారత్‌లోకి ప్రవేశించింది. అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ డ్రోన్‌ను కూల్చివేశాయి. డ్రోన్‌ పెద్ద బాక్సును మోసుకొచ్చినట్లు గుర్తించాం. బాక్సులో ఏడు గ్రనేడ్లు, ఏడు మ్యాగ్నెటిక్‌ బాంబులు ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్‌ కూల్చివేసిన ప్రాంతాన్ని బాంబు నిర్వీర్య బృందం తనిఖీ చేసింది. ఈ ఘటనపై ఆర్మీ దర్యాప్తునకు ఆదేశించింది. అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభానికి కొద్దిరోజుల ముందు ఆయుధాలతో డ్రోన్‌ కనిపించటం ప్రాధాన్యం సంతరించుకుంది. అమర్‌నాత్‌ యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారనే నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 43రోజుల పాటు సాగే ఈ యాత్ర జూన్‌ 30న రెండు దారుల్లో ప్రారంభం కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement