Tuesday, May 14, 2024

స‌ర్కారు వారి పాట ఓటీటీ రిలీజ్ అప్పుడేన‌ట‌… త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా న‌టించిన తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌’ . మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. స‌ముద్ర ఖ‌ని నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర‌లో న‌టించారు. ఓ బ్యాంకు నుంచి ప‌దివేల కోట్ల రూపాయ‌ల‌ను లోన్‌గా తీసుకున్న ఓ రాజ‌కీయ నాయ‌కుడు లోన్ క‌ట్ట‌కుండా ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి తిరుగుతుంటాడు. అత‌ని ఆహాన్ని అణిచి, లోన్ క‌ట్టేలా హీరో ఏం చేశాడ‌నే క‌థాంశంతో రూపొందిన చిత్ర‌మే ‘స‌ర్కారు వారి పాట‌’. డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్‌ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్ ప్ల‌స్ ప‌తాకాల‌పై సంయుక్తంగా రూపొందింది ఈ సినిమా. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన‌ ప‌న్నెండు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. పోస్ట్ పాండ‌మిక్ త‌ర్వాత విడుద‌లైన చిత్రాల్లో భారీ విజ‌యాన్ని సాధించిన చిత్రంగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక ‘స‌ర్కారు వారి పాట‌’ సినిమాను థియేటర్స్‌లో చూడ‌లేని ఆడియెన్స్ ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా! అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సినీ స‌ర్కిల్స్‌లో తాజాగా వినిపిస్తోన్న స‌మాచారం ప్ర‌కారం ‘స‌ర్కారు వారి పాట‌’ జూన్ 10 లేదా జూన్ 24.. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక‌రోజున ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానుంద‌ట‌. ఇప్పుడున్న ప‌రిస్థితులు దృష్ట్యా అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేసేలా ఓటీటీ సంస్థ ప్ర‌తినిధులు మేక‌ర్స్‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement