Friday, May 24, 2024

ఏపీ సీఎం సహాయనిధికి భారీగా విరాళం

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్‌ – 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్ధలు 1,33,34,844 రూపాయల విరాళం అందించింది. విరాళానికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌కు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అందజేశారు.  

విరాళాలు అందజేసిన సంస్ధల వివరాలు

కాకినాడ ట్రస్ట్‌ హాస్పిటల్‌ – రూ. 1,00,000

భవాని కాస్టింగ్స్‌ ప్రై.లిమిటెడ్‌ – రూ. 5,00,000

ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్, విజయవాడ – రూ. 14,20,000

- Advertisement -

వేద సీడ్‌ సైన్స్‌ ప్రై.లిమిటెడ్‌ – రూ. 10,00,000

ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ పివిఎస్‌ఎస్‌ మూర్తి – రూ. 15,00,000

కాళీశ్వరీ రిఫైనరీ అండ్‌ ఇండస్ట్రీ ప్రై.లిమిటెడ్‌ – రూ. 25,00,000

వీటితో పాటు మరికొన్ని సంస్ధలు కూడా తమవంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేశాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement