Sunday, May 19, 2024

ఏపీలో పిడుగుల ముప్పు – ఏఏ ప్రాంతాల్లో తెలుసా ?

ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ప్రకాశం జిల్లా లో చంద్రశేఖరపురం, బేస్తవారిపేట, వెలిగండ్ల, కనిగిరి, హనుమంతునిపాడు, కొనకనమిట్ల, మర్రిపూడి, పొదిలి, గిద్దలూరు, చీమకుర్తి అలాగే నెల్లూరు జిల్లాలో నెల్లరు, సీతారామపురం, వరికుంటపాడు, ఉదయగిరి, దుత్తలూరు, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూర్, దగదర్తి, అనుమసముద్రంపేట, కలిగిరి, సంగం, కొడవలూరు మరోవైపు కర్నూలు జిల్లాలో కర్నూలు, నందికోట్కూరు, కల్లూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, మిడ్తూరు, ఓర్వకల్లు, గడివేముల, దేవనకొండ, సి.బేళగల్, కొత్తపల్లె, వెల్దుర్తి ప్రాంతాల్లో చిత్తూరు జిల్లా
శాంతిపురం, రామకుప్పం, వెంకటగిరికోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, బంగారుపాలెం, గంగవరం, సోమల ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువుగా పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అలాగే విజయనగరం జిల్లాలో మెరకముడిదం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల, తేర్లాం, బాడంగి, దత్తిరాజేరు, నెల్లిమర్ల, బొందపల్లి, బొబ్బిలి. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, గంగువారి సిగడాం , రాజాం, సంతకవిటి, రేగడిఆముదాలవలస, ఎచ్చెర్ల, రంగస్థలం, బూర్జ. తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు, వరరామచంద్రాపురం, మారేడుమిల్లి, వై.రామవరం మండలాలు పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉందని పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండని విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement