Saturday, September 21, 2024

ఏపీలో కొత్తగా 11 వేల కేసులు.. 38 మరణాలు!

ఏపీలో కరోనా కేసులు భారీగా వ్యాపిస్తున్నాయి. కేసుల సంఖ్యతోపాటు మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కేసులు 11 వేల మార్క్ ను దాటింది. గత 24 గంటల్లో ఏకంగా 11,766 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో 38 మంది కరోనా వల్ల మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 4,441 మంది కరోనా నుంచి బయటపడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,885 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 1,593… అనంతపురం జిల్లాలో 1,201… కర్నూలు జిల్లాలో 1,180… శ్రీకాకుళం జిల్లాలో 1,052 కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ వల్ల నెల్లూరు జిల్లాలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురు, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

ఇక, ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 10,09,228 కేసులు నమోదయ్యాయి. 9,27,418 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,579కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement