Wednesday, May 15, 2024

Delhi: విక‌సిత్ భార‌త్ సందేశాల‌ను నిలిపివేయండి..

బిజెపికి ఎన్నిక‌ల సంఘం షాక్
ప్ర‌గ‌తి నివేదిక మెస్సెజ్ ల‌కు బ్రేక్
త‌క్ష‌ణం అమ‌లుకు ఆదేశం

న్యూఢిల్లీ – సార్వ‌త్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువ‌డిన నేప‌థ్యంలో ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ పేరుతో దేశ ప్రజలకు పంపుతున్న అన్ని రకాల సందేశాలను వెంటనే నిలిపివేయాలంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా గత పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి, సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా “వికసిత్ భారత్ సంపర్క్” పేరిటీ వాట్సాప్ లో సందేశాలను పంపుతుంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో త‌క్ష‌ణం ఈ సందేశాల‌ను నిలిపివేయాల‌ని ఈసీ ఆ పార్టీని కోరింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement