Sunday, April 28, 2024

TS : సీఎం రేవంత్ సమక్షంలో ఆత్రం సుగుణ కాంగ్రెస్‌లో చేరిక

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ప్రభ న్యూస్ః ఆదివాసీ ఉద్యమ నాయకురాలు, ఆత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జి మంత్రి సీతక్క సమక్షంలో నేడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు పార్టీ కండువా క‌ప్పి రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, ఉపాధ్యాయ ఉద్యోగానికి బుధవారం సాయంత్రమే రాజీనామా చేసిన సుగుణ అదిలాబాద్ లోక్‌స‌భ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆమెకు సీటు ల‌భించిన‌ట్ల‌యితే కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల నుండి ముగ్గురు ఆదివాసి అభ్యర్థులే కానునండ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement