Friday, April 26, 2024

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కుర్చీలకు పేయింటింగ్ వేసిన ధోని.. వీడియో వైరల్!

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2023 16వ ఎడిషన్ ఐపిఎల్ సీజన్ రానే వచ్చింది. అయితే, ఈ ఐపిఎల్ సీజన్ తో తన ఐపీఎల్ కెరీర్ కు ముగింపు పలకాలనుకుంటున్న భారత లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని… మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలపాలని చూస్తున్నాడు. ఇక కరోనా తర్వాత తొలిసారి చెన్నైలో అభిమానుల సమక్షంలో ధోనీ బరిలోకి దిగబోతున్నాడు. ఇందుకోసం చెన్నై లోని చెపాక్ స్టేడియంలో నెల నుంచే ధోనీ, సీఎస్కే క్రికెటర్లు ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. పగలు, రాత్రి ట్రెయినింగ్ లో పాల్గొంటున్న ధోని సహచరులతో సరదాగా కూడా గడుతుపున్నాడు. ఈ క్రమంలో ఇవ్వాల (సోమవారం) ఉదయం స్టేడియంలోని కుర్చీలకు పెయింటింగ్ వేస్తూ కనిపించాడు ధోనీ.

చెపాక్ స్టేడియాన్ని ఈ మధ్యే పునరుద్ధరించి, చాలా ఏళ్ల తర్వాత ఐ,జే,కే స్టాండ్లను ఉపయోగంలోకి తెచ్చారు అక్కడి మానేజ్మెంట్. ఈ సీజన్ ఐపీఎల్ లో అభిమానులను ఈ స్టాండ్లలోకి అనుమతించనున్నారు. ఈ క్రమంలో స్టాండ్స్ లోని కుర్చీలకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు అక్కడి సిబ్బంది. ఇక ధోనీ కూడా పసుపు, నీలం రంగు స్ప్రే పెయింట్ క్యాన్‌లతో బయటికి వచ్చి చెపాక్‌లో రెండు కుర్చీలకు పెయింట్ చేశాడు. ఈ వీడియోను సీఎస్కే తమ ట్విట్టర్ లో షేర్ చేసింది. కాగా, ఐపీఎల్ ఈనెల 31న మొదలవనుంది. సీఎస్కే జట్టు ఈ సీజన్ లో తమ సొంతనగరంలో తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 3న లక్నోతో తలపడనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement