Sunday, May 5, 2024

ఇంజన్ ముందుకి – బోగీలు వెన‌క్కి….

స్టేష‌న్ ఘ‌నాపూర్ – ధానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌ బయలుదేరిన రైలు (02791) జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో నేటి ఉదయం 10.54 గంటల ప్రాంతంలో ఇంజిన్‌ నుంచి బోగీలు విడిపోయాయి. దీంతో ఇంజిన్‌ 250 మీటర్లు బోగీలు లేకుండానే ముందుకెళ్లింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే మళ్లీ ఇంజిన్‌ను వెనక్కి రప్పించి.. బోగీలను ఇంజిన్‌తో అనుసంధానించడంతో తిరిగి రైలు బయలుదేరింది. ఇంజిన్‌ నుంచి బోగీలు విడిపోవడంతో సుమారు అరగంట పాటు స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వే గేటు వద్ద బోగీలు ఆగిపోయాయి. అయితే కప్లింగ్ లింక్ ఊడిపోవడంతో ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయిందని రైల్వేవర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement