Thursday, May 2, 2024

జనసేనకే తిరుపతి ఎంపీ సీటు?

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కరోనాతో మృతి చెందడంతో త్వరలో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నిక షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఖరారుపై వివిధ పార్టీలు నిమగ్నమయ్యాయి. తిరుపతి ఎంపీ సీటును పోత్తులో భాగంగా జనసేనకు కేటాయించేందుకు బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తిరుపతిలో ఏపీ బీజేపీ నాయకత్వం బీజేపీ నాయకుడినే బరిలోకి దించాలని అధిష్టానానికి సూచించింది. అయితే ఆపార్టీ కేంద్ర నాయకత్వం తమకు అత్యంత సన్నిహితులతో చేయించుకున్న సర్వేలు, ఏపీ బీజేపీ నాయకులు చెప్పిన దానికి భిన్నంగా ఉండటంతో బీజేపీ కేంద్ర నాయకత్వం జనసేనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పర్యటన రద్దు అయినట్టు బీజీపీలో చర్చ జరుగుతోంది. ఇంతే కాకుండా జనసేన పార్టీ టీడీపీకి దగ్గర అవుతుందనే ప్రచారంతో బీజేపీ కేంద్ర నాయకులు అప్రమత్తమై ఆ మైత్రీ కుదిరితే బీజేపీ ఏపీలో ఒంటరి అవుతుందని గ్రహించి రాబోయే తమ మైత్రి, తిరుపతిలో ఓటు బ్యాంక్‌ను దృష్టిలో ఉంచుకుని తిరుపతి సీటు జనసేనకు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement