Thursday, April 25, 2024

పడిక్కల్‌ సెంచరీల మోత.. ఆనందంలో ఆర్సీబీ ఫ్యాన్స్‌

ఐపీఎల్‌ 2020 లో అదరగొట్టిన దేవదత్‌ పడిక్కల్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో కదం తోక్కుతున్నాడు. టోర్నీలో ఇప్పటికే వరుస మ్యాచ్‌లో 152, 126, 145 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్‌ 2021 సీజన్‌లో పడిక్కల్‌ అదరగొట్టడం ఖాయమని ఆర్సీబీ అభిమానులు ఆనందపడుతున్నారు. ఐపీఎల్‌ 2020 లో పడిక్కల్‌ 473 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్థసెంచరీలున్నాయి. అయితే ఈ సీజన్‌లోనూ పడిక్కల్‌ అదరగొడతాడని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది. అటు అర్సీబీ ఫ్యాన్స్‌ సైతం ఈ సారి ఎలాగైన తమ ఫేవరెట్‌ టీం కప్పుకొట్టాలని ఆత్రుతతో ఎదురుస్తున్నారు. అంతేకాదు భవిష్యత్తులో ఈ లెఫ్ట్‌ హాండర్‌ టీమిండియాకు కూడా ఆడే అవకాశం ఉందని ఫ్యాన్స్‌ అంచనాలు కడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement