Friday, April 26, 2024

రష్యా ఎయిర్‌బోర్న్‌ రెజిమెంట్‌ ధ్వంసం: ఉక్రెయిన్‌

రష్యాకు చెందిన ఒక ఎయిర్‌బోర్న్‌ రెజిమెంట్‌ మొత్తాన్ని తమ దళాలు నాశనం చేశాయని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ జనరల్‌ స్టాఫ్‌ ఫేస్‌బుక్‌ పేజీలో ప్రకటించారు. రష్యాకు చెందిన కొస్ట్రామ 331వ గార్డ్స్‌ ఎయిర్‌ బోర్న్‌ రెజిమెంట్‌ మొత్తాన్ని నాశనం చేశామని పేర్కొంది. వీరితో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలో భీకర పోరు జరిగినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్‌ దళాలతో జరిగిన పోరులో కేవలం ఒక్కే ఒక్క వ్యక్తి మిగిలాడని పేర్కొంది. ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో రష్యా భారీ నష్టాలను చవిచూసింది.

ఈ విషయాన్ని ఓరెక్స్‌ అనే ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ధ్రువీకరించింది. కనీసం 250 ట్యాంకులను రష్యా కోల్పోయినట్లు పేర్కొంది. మొత్తం 1000కి పైగా వాహనాల వరకు ధ్వంసమైనట్లు పేర్కొంది. దాదాపు 50 వరకు హెలికాప్టర్లను కూల్చినట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement