Wednesday, May 8, 2024

జగన్ ఆగర్భ శ్రీమంతుడు.. ఇలాంటి నేత మళ్లీ రారు: డిప్యూటీ సీఎం ధర్మాన

ఏపీ సీఎం జగన్‌పై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆగర్భ శ్రీమంతుడని.. జగన్ లాంటి నాయకుడు నభూతో న భవిష్యత్ అని తెలిపారు. అలాంటి నాయకుడు మరొకరు దొరకరు అనిచ భవిష్యత్‌లోనూ రాబోరని స్పష్టం చేశారు. జగన్‌పై టీడీపీ నేతల విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. చంద్రబాబుకు 69 ఏళ్లు వచ్చేశాయని, వయసు అయిపోవడం వల్ల చంద్రబాబు చిన్నపిల్లోడిలా వ్యవహరిస్తున్నారని చురకలు అంటించారు.

ఇప్పటికైనా జగన్‌ను విమర్శించుకోవడం చంద్రబాబు, టీడీపీ నేతలు మానుకోవాలన్నారు. రెండెకరాలున్న చంద్రబాబు ఈ స్థాయికి ఎలా ఎదిగాడో… మర్చిపోతే ఎలా? అని నిలదీశారు. చంద్రబాబు, లోకేష్‌లను చూస్తే జాలేస్తుందని.. నక్కకు నాగ లోకానికీ ఉన్న తేడా లోకేష్ తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్‌కు సీఎం జగన్‌ను విమర్శించే స్థాయి ఉందా? అని నిలదీశారు. తలకిందులుగా తపస్సు చేసినా జగన్‌ను అందుకోవడం లోకేష్ వల్ల కాదని ధర్మాన ఆరోపించారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో కరోనా ఆంక్షల సమయం పొడిగింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement