Friday, May 3, 2024

గంగూలీకి డెల్టా ప్లస్ వేరియంట్‌ పాజిటివ్‌..

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి కరోనా పరీక్షల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కరోనా బారిన పడిన గంగూలీ కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు ఒమిక్రాన్‌ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ రావడంతో వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.

కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో గంగూలీ వైద్యులు పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. గతంలో గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేయించుకున్న దాదా కోలుకున్నాడు. వైద్య పరీక్షల్లో డెల్టా ప్లస్‌ పాజిటివ్‌ రావడంతో గంగూలీకి ప్రత్యేక వైద్యబృందం చికిత్స అందిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement