Friday, May 3, 2024

క‌రొనా బారిన ప‌డిన ప్ర‌ముఖ ఫుట్ బాల్ ప్లేయర్..

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ కరోనా బారిన పడ్డాడు. మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న పారిస్‌ సెయింట్‌ జెర్మైన్‌ (పీఎస్‌జీ) ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించింది. ఫ్రెంచ్‌కప్‌లో భాగంగా సోమవారం రాత్రి వాన్నెస్‌తో మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా వైద్యపరీక్షలు నిర్వహించారు.

కరోనా వైద్యపరీక్షల్లో నలుగురు పీఎస్‌జీ ప్లేయర్లకు కరోనా సోకినట్లు తేలిందని పీఎస్‌జీ వెల్లడించింది. ప్రస్తుతం వీరంగా ఐసోలేషన్‌లో ఉన్నట్లు పీఎస్‌జీ పేర్కొంది. కాగా పీఎస్‌జీ తరఫున 11లీగ్‌ల్లో మెస్సీ ఒకే ఒక గోల్‌ చేశాడు. కాగా మెస్సీతోపాటు బెర్నాట్‌, అదనపు గోల్‌కీపర్‌ సెరిగో రికో, టీనేజ్‌ మిడ్‌ఫీల్డర్‌ నాథన్‌ బిటుమజాలా కొవిడ్‌19 బారిన పడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement