Friday, May 3, 2024

ఏపీలో కేసులు తగ్గినా మరణాలు తగ్గలే…103 మంది 24 గంటల్లో మృతి

ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 84,502 సాంపిల్స్ ని పరీక్షించగా 14,429 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే ఈ మహమ్మారి వల్ల చిత్తూర్ లో పదిహేను మంది, పశ్చిమ గోదావరి లో పదిహేను మంది, విశాఖపట్నం లో పది, నెల్లూరు లో తొమ్మిది, అనంతపూర్ లో ఎనిమిది, తూర్పు గోదావరి లో ఎనిమిది, కృష్ణ లో ఎనిమిది,గుంటూరు లో ఏడుగురు, విజయనగరం లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, వైఎస్ఆర్ కడప లో నలుగురు, కర్నూల్ లో
నలుగురు మరియు ప్రకాశం లో ఇద్దరు మరణించారు.

మరోవైపు గడచిన 24 గంటల్లో 20,746 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 1657986కి చేరగా 180362 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే మొత్తం 1466990 డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు 10634 మంది మృతి చెందారు.నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,90,09,047 సాంపిల్స్ ని పరీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement