Thursday, April 25, 2024

తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు..

తెలంగాణ కరోనా కారణంగా మూత పడిన విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో కరోనా వ్యాప్తి కాస్త నెమ్మదించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి జులై 5 వరకు తొలి విడత అడ్మిషన్లు నిర్వహించనున్నారు. అయితే ఇది మొదటి విడుత ప్రవేశాల షెడ్యూల్‌ మాత్రమేనని, పరిస్థితిని బట్టి రెండో విడుత ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. పదో తరగతి విద్యార్థుల ఇంటర్నెట్‌ మెమోల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఇప్పటికే అయా జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఎస్ఎస్‌సీ ఒరిజినల్‌ మెమోలు, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు సమర్పించిన తర్వాతే ప్రొవిజినల్‌ అడ్మిషన్లను ఆమోదించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement