Friday, May 3, 2024

సుశాంత్ కేసులో కీలక మలుపు….సిద్దార్థ్ అరెస్ట్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ గతేడాది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు వ్యవహారంలో విచారణ చేస్తుండగా డ్రగ్స్ వివాదం కూడా తెరపైకి వచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ కేసులో సుశాంత్ పిఆర్ మేనేజర్ గా పని చేసిన సిద్ధార్థ్ పితాని ను ఎన్సీబి అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

సిద్దార్థ్ గతంలో సుశాంత్ తో అతని ఫ్లాట్లో ఉన్నాడట. అలాగే ఆత్మహత్యకు ముందు సిద్ధార్థ్ తో ఫోన్లో మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. ఇక సుశాంత్ గత ఏడాది జూన్ 14న ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నారు. కాగా సిద్దార్థ్ ను ఇప్పటికే పలుమార్లు విచారించగా…. తాజాగా సిద్దార్థ్ ను ఎన్సీబి అధికారులు అరెస్టు చేశారు. సిద్దార్థ్ ను అరెస్టు చేసినట్లు ఎన్సీబి ముంబై యూనిట్ హెడ్ సమీర్ వాంఖడే దృవీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement