Friday, April 26, 2024

ఇండియాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టింది. గ‌డిచిన 24 గంట‌లలో కొత్తగా 3,43,144 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరోవైపు 4 వేల‌ మంది కరోనా కారణంగా మ‌ర‌ణించారు. అలాగే 3,44,776 మంది క‌రోనా నుంచి గడిచిన 24 గంటల్లో కొలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం మొత్తం దేశంలో ఇప్పటివ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 2.40 కోట్లు చేరింది. అలాగే
2 కోట్లు మంది కొలుకున్నారు.

ఇక ఇప్పటివరకు 2.62 ల‌క్ష‌లు మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక ప్రస్తుతం 37.04 ల‌క్ష‌ల యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గడిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 18.75 ల‌క్ష‌ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. ఇప్ప‌టిదాకా 31.13 కోట్ల శాంపిల్స్ ప‌రీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement