Thursday, May 9, 2024

హెలికాప్టర్‌ను ఢీకొన్న పక్షి – సురక్షితంగా బయటపడ్డ కర్నాటక పిసిసి చీఫ్ డి కె శివకుమార్

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ప్రమాదం తప్పింది. డీకే శివకుమమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను హోసాకోట్ సమీపంలో పక్షి ఢీకొట్టింది. ముందు అద్దం కొంత భాగం పగిలిపోయింది. అయితే పైలెట్ చాకచాక్యంగా వ్యవహరించి హెలికాప్టర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఒక్కరికి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. వివరాలు.. ఈ రోజు ఉదయం బెంగళూరు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హెలికాప్టర్ ముళబాగిలుకు బయలుదేరారు. దాదాపు 12 గంటల ప్రాంతంలో జక్కూరు నుంచి డీకే శివకుమార్ హెలికాప్టర్ బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలోని హోసకోటే సమీపంలో గాలిలో ఉండగానే ఒక డేగ ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్‌ను హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే పైలెట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పిందని డీకే శివకుమార్ సన్నిహిత వర్గాలు తెలిపాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement