Sunday, April 28, 2024

రైతులు ధైర్యంగా ఉండండి.. మీకు మేమున్నాం.. మంత్రి కేటీఆర్

వడగండ్ల వానలతో పంట నష్ట పోయిన రైతులందరికీ ఎకరాకు 10 వేల రూపాయలు,హెక్టారుకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి రైతులను ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.వడగండ్ల వర్షాలకు ఎల్లారెడ్డి పేట మండలంలోని గుంట పల్లి చెరువు గ్రామంలో దెబ్బ తిన్న పంటలను మంత్రి పరిశీలించారు. రైతులు ఎవ్వరూ అదైర్య పడవద్దని ,పంట నష్టం జరిగిన వారందరికీ ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.మండలంలో 133 ఎకరాలలో వరి పంట కు నష్టం వాటిల్లిందని వ్యవసాయ,రైతుభందు అధికారుల అంచనా వేశారని తెలిపినట్లు మంత్రి చెప్పారు. ప్రతి ఎకరాకు 10 వేల రూపాయలు,హెక్టారుకి 25 వేల రూపాయల పంట నష్టం ప్రభుత్వం ద్వారా అందిస్తామని ,రైతులు ఎవరు ఏ అధికారి వద్దకు వెళ్లకుండా అధికారులే రైతుల ఇళ్ల‌ వద్దకు వచ్చి పంట నష్టం పరిహారం సొమ్ము అందిస్తారని కేటీఆర్ తెలిపారు.ఎండాకాలంలో ఇలా వర్షాలు పడుతాయని ఎవరు అనుకోలేదని, ప్రకృతి పగ బట్టి నట్లయిందని మంత్రి ఆవేదన చెందారు.

చెడ గొట్టు వానలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని దైర్యంగా వుండాలని మీకు మేమున్నాం అని మంత్రి భరోసా కల్పించారు.రైతులను ఆదుకోవాలని సిఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు. సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా పోడు భూముల ను క్రమ బద్దికరించే ఫైల్ పైనే సి ఎం కేసీఅర్ తొలి సంతకం చేశార‌ని కేటీఆర్ గుర్తు చేశారు.మనది రైతు ప్రభుత్వం అని రైతుల ను ఆదుకోవడానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ అన్నారు.గుంట పల్లి చెరువు తండా,వీర్ణప ల్లి,గజసింగవరం, గొరంటా ల గ్రామాలలో వడ గండ్లు పడి వరి పంట కు తీవ్రంగా నష్టం జరిగినట్లు తెలిసింది అని,పశువులకు మేతకు తప్ప వరీ పంట దేనికి పనికి రాకుండా పోవడం బాధాకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు.పోడు రైతులకు,కౌలు రైతులకు కూడా పంట నష్టం అందేలా చూస్తామని ,ఆ రైతుల వివరాలతో నివేదిక తయారు చేయాలని జిల్లా వ్యవసాయ,రెవిన్యూ ,అధికారులను మంత్రి ఆదేశించారు.మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్,బి అర్ ఎస్ జిల్లా అద్యక్షుడు తోట ఆగయ్య, జిల్లా రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గడ్డం నర్సయ్య,ఎంపిపి పిల్లి రేణుక కిషన్,జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, మండల తహశీల్దార్ జయంత్ ,వ్యవసాయ అధికారి భూమి రెడ్డి,ఎంపి డి ఓ చిరంజీవి ,పలువురు సర్పంచ్ లు,రైతులు వున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement