Monday, May 6, 2024

Czech Republic – ప్రేగ్ విశ్వవిద్యాలయంలో కాల్పులు – 15 మంది మృతి

చెక్ రిపబ్లిక్‌లో ఘోరమైన ఘటన వెలుగు చూసింది. గత కొద్ది దశాబ్దాల కాలంలో ఇంతటి అత్యంత దారుణమైన కాల్పుల ఘటన జరగలేదు. గురువారం రాత్రి ప్రేగ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో 24 ఏళ్ల దుండగుడితో సహా 15 మందికి పైగా మరణించారు.డజన్ల కొద్దీ గాయపడ్డారు. దాడి చేసిన వ్యక్తి చనిపోయాడని అధికారులు తెలిపారు.

14వ శతాబ్దపు చార్లెస్ బ్రిడ్జ్ వంటి ప్రధాన పర్యాటక ప్రదేశాలకు సమీపంలో ఉన్న చార్లెస్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ వద్ద కాల్పులు జరిగాయి. “15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కనీసం 24 మంది గాయపడ్డారు” అని పోలీసు చీఫ్ మార్టిన్ వోండ్రాసెక్ కాల్పుల తరువాత విలేకరులతో అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement