Sunday, April 28, 2024

Flash: కశ్మీర్ ఉగ్రదాడిలో జవాన్ మృతి

జమ్ముకశ్మీర్‌‌లో జరిగిన ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ జవాన్‌ అమరుడైయ్యాడు. శ్రీనగర్‌‌లోని లాల్‌ చౌక్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై నిన్న టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. రెండు వైపులా హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ విశాల్ కుమార్‌‌ ప్రాణాలు కోల్పోయాడు. మరో జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. పుల్వామాలో ఇద్దరు వలసకార్మికులపై కాల్పులు జరిపిన కొద్ది గంటలకే లాల్ చౌక్ లో కాల్పులు జరిపారు. ఈ జవాన్‌ భౌతిక కాయానికి బుద్గాంలో ఇవాళ ఉదయం జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్‌ సింగ్ నివాళి అర్పించారు. అలాగే సీఆర్పీఎఫ్ జవాన్లు సైనిక వందనం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement