Tuesday, May 7, 2024

ఏపీలో కరోనా విశ్వరూపం.. ఒక్కరోజే 5,086 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 35,741 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,086 మందికి పాజిటివ్ అని తేలింది. ఒకే రోజు కరోనాతో 14 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 835 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 626, గుంటూరు జిల్లాలో 611, శ్రీకాకుళం జిల్లాలో 568, తూ.గో. జిల్లాలో 450, విశాఖ జిల్లాలో 432, కృష్ణా జిల్లాలో 396, అనంతపురం జిల్లాలో 334, విజయనగరం జిల్లాలో 248, ప్రకాశం జిల్లాలో 236, నెల్లూరు జిల్లాలో 223, కడప జిల్లాలో 96, ప.గో. జిల్లాలో 31 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు.

గత 24 గంటల్లో 1,745 మంది కరోనా నుంచి కోలుకోగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురం, కర్నూలు, విశాఖ జిల్లాలలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,42,135 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,03,072 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 31,710గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,353గా ఉంది. కాగా బుధవారం ఒక్కరోజే ఏపీలో 6,28,961 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.ః

Advertisement

తాజా వార్తలు

Advertisement