Friday, April 26, 2024

క్రీడాకారులకు క్రికెట్‌ కిట్‌..

ఘట్‌కేసర్‌ : మండలంలోని ఎదులాబాద్‌ గ్రామంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ సందర్భంగా క్రీడాకారులకు వైఎస్‌రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి క్రికెట్‌ కిట్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ చంద్రబాబు విచ్చేశారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ యువత క్రీడల పట్ల దృష్టి సారించాలని సూచించారు. తమకు నచ్చిన క్రీడలలో పాల్గొని రాణించినట్లయితే చెడు వ్యసనాల వైపు తమ దృష్టి వెళ్లకుండా ఉంటుందని,, అలాగే శరీరక దృఢత్వం కలిగి ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. క్రీడలలో రాణించే క్రీడాకారులకు వైఎస్‌రెడ్డి ట్రస్టు ద్వారా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సురేష్‌, ఎంపిటీసీ గట్టగళ్ల రవి, మర్పల్లిగూడ ఉప సర్పంచ్‌ నరేష్‌, వార్డు సభ్యులు ఆంజనేయులు, రాంచందర్‌, సురేష్‌, సొసైటీ డైరెక్టర్‌ చందుపట్ల ధర్మారెడ్డి, మాజీ సర్పంచ్‌ బట్టె శంకర్‌, మాజీ ఎంపిటీసీ మంకం రవి, టిఆర్‌ ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు కందుల కుమార్‌, ప్రధాన కార్యదర్శి బైనగారి నాగరాజు, ఎస్సీసెల్‌ అధ్యక్షులు పెరమాళ్ల సుదర్శన్‌, మండల పార్టీ యూత్‌ అధ్యక్షులు కొత్త బాలుయాదవ్‌, నాయకులు యుగేందర్‌గౌడ్‌, బసవరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement