Saturday, April 27, 2024

కోవిడ్‌ టీకాపై అపోహలు వద్దు..

మేడ్చల్‌ : కోటిడ్‌ టీకాపై అపోహాలు వద్దని.. ప్రతి ఒక్కరు కోవిడ్‌ టీకాను వేయించుకోవాలని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్‌ జైపాల్‌రెడ్డి, మేడ్చల్‌ తెరాస నాయకులు సాటే నరేందర్‌లు తెలిపారు. ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రి కేంద్రంలో వారు కోవిడ్‌ టీకాను వేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా రెండో వేవ్‌ విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు కోవిడ్‌ టీకాను వేయించుకోవాలని కోరారు. ప్రజలు తప్పకుండా శానిటైజర్‌ వినియోగించుకోవాలని.అలాగే భౌతిక దూరాన్ని పాటించి మాస్క్‌లను తప్పని సరిగా ధరించాలని జైపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డిలు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement