Sunday, May 5, 2024

17 మందికి కరోనా పాజిటివ్..భయం గుప్పిట్లో ఆ హాస్టల్

జగిత్యాల జిల్లా కేంద్రంలో మరోసారి కరోనా కలకలం రేపింది. జగిత్యాల పట్టణములోని భవాని నగర్ లో ఉన్న తెలంగాణ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ లో కరోనా లక్షణాలు ఉన్న 30 మంది విద్యార్థినిలకు కరోన టెస్టులు నిర్వహించగా 17 మంది విద్యార్థినిలకు కరోన పాజిటివ్ గా తేలింది. విషయం తెలుసుకున్న DM&HO శ్రీధర్ హుటాహుటిన హాస్టల్ కు చేరుకొని పరిశీలించారు.

17 మంది విద్యార్థినిలకు కరోన పాజిటివ్ రావడంతో విద్యార్థినిలు భయాందోళనలకు గురవుతున్నారు అదేవిధంగా విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ దగ్గరికి చేరుకుని ఆందోళన చెందుతున్నారు. హాస్టల్ లో ఐసోలేషన్ ఏర్పాటు సౌకర్యాలు ఉన్నాయని ఐసోలేషన్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement