Saturday, May 4, 2024

‘జాతిర‌త్నాలు’ మూవీకి సీక్వెల్…?

‘మ‌హాన‌టి’ ఫేం ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ నిర్మాత‌గా అతి తక్కువ బ‌డ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ‘జాతి ర‌త్నాలు’. ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ కే ఏకంగా రెండేళ్లకు పైగానే ప‌ట్టింది. ఈ సినిమా ద్వారా అనుదీప్ కేవీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా మంచి హిట్ టాక్‌తో దూసుక‌పోతుంది. ఈ సినిమా క‌నీసం రూ.40 కోట్లు కొల్ల‌గొట్టేలా ఉంది. ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు అనుదీప్ జాతిర‌త్నాలు సీక్వెల్ కూడా ఉందంటూ హింట్ ఇచ్చేశాడు. త్వ‌ర‌లోనే సీక్వెల్ ప‌ట్టాలెక్కుతుంద‌ని, త్వ‌ర‌లోనే స్క్రిప్ట్ వ‌ర్క్‌పై అనుదీప్ వర్కవుట్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఓవర్సీస్‌లోనూ ఈ చిన్న సినిమా భారీ క‌లెక్షన్లు రాబ‌డుతుండ‌టం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement