Monday, May 6, 2024

ఏపీలోనూ పెరుగుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కొన్ని రోజుల క్రితం భారీగా తగ్గుముఖం పట్టిన కేసులు. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 210 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ఏకంగా 85 కేసులు నమోదయ్యాయి. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,91,388కి చేరుకున్నాయి. మొత్తం 8,82,981 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 7,180 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా నిన్న ఒకరు కరోనా భారిన పడి మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement