Thursday, May 2, 2024

క‌రోనా త‌గ్గుముఖం.. కొత్త‌గా 4858 మంది పాజిటివ్‌

దేశంలో కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌త నెల‌లో 10 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌గా..ప్ర‌స్తుతం ఆ సంఖ్య 4వేల నుంచి 5 వేల వ‌ర‌కు న‌మోద‌వుతుంది. అంటే క‌రోనా పాజిటివిటి రేట్ భారీగానే త‌గ్గింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆదివారం 5664 మంది కరోనా బారిన పడగా, నేడు కొత్తగా 4858 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,45,39,046కు చేరాయి. ఇందులో 4,39,62,664 మంది కోలుకుకోగా, ఇప్పటివరకు 5,28,355 మంది మరణించారు. మరో 48,046 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 4735 మంది కోలుకోగా, 10 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement